image



ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు
January 2023



→ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియ మించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 
→ ప్రస్తుతం న్యాయాధికారులుగా పని చేస్తున్న పి. వెంకట జ్యోతిర్మయి, వి. గోపా లకృష్ణారావులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని మంగు ళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో సమా వేశమైన కొలీజియం నిర్ణయం తీసుకుంది. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో జనవరి 1వ తేదీ నాటికి 30 మంది సేవలంది. వస్తున్నారు. ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
→ ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరు తుంది. 
→ దేశంలోని మొత్తం 5 హైకోర్టులకు 9 మంది పేర్లను కౌలీజియం సిఫార్సు చేసింది. 
→ ఇందులో కర్ణాటక హైకోర్టుకు ముగ్గురు, ఆంధ్ర ప్రదేశ్, మణిపుర్ హైకోర్టులకు ఇద్దరు చొప్పున, బాంబే, గువాహటి హైకోర్టు లకు ఒక్కొక్కరి చొప్పున పేర్లను ప్రతిపాదించింది.
 



AP