→జమ్మూ-కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా డోరూ బ్లాకులోని టెధన్ గ్రామ ప్రజలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు విద్యుత్తు సౌక ర్యాన్ని పొందారు.
→ఇన్నేళ్లు కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తుల మధ్యే రాత్రిళ్లు గడిపిన ఆ పల్లెవా సులు తొలిసారిగా లైటు వెలగడం చూశారు.
→అధికారులు ఎంతో కష్టపడి కొండ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి 63 కేవీ ట్రాన్స్ఫార్మరుతో విద్యుత్తు సౌకర్యం కల్పించారు.
→గ్రామంలో మొత్తం 60 కుటుంబాలతో దాదాపుగా 200 మంది జనం ఉంటారు. కేంద్ర ప్రభుత్వ సౌభాగ్య పథకం కింద గ్రామంలోని ఇంటింటికి విద్యుత్తును చేరవేసినట్లు అధికారులు తెలిపారు.
→గ్రామస్థులు విద్యుత్తు సిబ్బందిని పూలమాలలతో సత్కరిం చారు. మేళతాళాలతో వేడుక చేసుకున్నారు.
National