→ రాజస్థాన్ రాజధాని జైపుర్ లో 83వ అఖిల భారత సభాపతుల సదస్సు జరగనుంది.
→ ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్డ్ ప్రారంభించనున్నారు.
→ జైపుర్ లో ఈ సదస్సు జరగడం ఇది నాలుగోసారి. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించను న్నారు.
→ అందులో
→ 1. ప్రజాస్వామ్య మాతగా జీ-20 సదస్సుకు భారత్ నాయకత్వం వహించడం,
→ 2. పార్ల మెంటు, శాసన వ్యవస్థలను మరింత సమర్థంగా, జవా బుదారీగా, ఉత్పాదకంగా మార్చాల్సిన అవసరం,
→ 3. డిజిటల్ పార్లమెంటుతో రాష్ట్రాల శాసన సభలను అనుసంధానం చేయడం,
→ 4. రాజ్యాంగస్ఫూర్తిని అను సరించి శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి సంబంధించిన అంశాలు న్నాయి.
→ ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, అన్ని రాష్ట్రాల సభాపతులు, మండలి చైర్మన్లు పాల్గొంటారు.
National