→ స్వతంత్ర భారత దేశం వందేళ్ల ప్రస్థానానికి చేరుకునే క్రమంలో ఆరంభించిన (వచ్చే 25 ఏళ్ల) అమృత కాల యాత్రలో ప్రవాస భారతీయులు అత్యంత కీలకమైన పాత్రను నిర్వ హించనున్నారని ప్రధాని మోదీ తెలిపారు.
→ విదేశీ నేలపై వీరు మన ప్రచార దూతలని అభివర్ణిం చారు. మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ నగరంలో సోమ వారం 17వ ప్రవాస భారతీయ దివస్ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
→సురినామ్ రిపబ్లిక్ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతో ప్రత్యేక అతిథిగా, గయానా అధ్యక్షుడు మొహమద్ ఇర్ఫాన్ అలీ ముఖ్యఅతిధిగా హాజర య్యారు. 'భారతీయ విశిష్టతలైన యోగ, ఆయు ర్వేదం, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, తృణధా న్యాలకు మీరే (ప్రవాస భారతీయులే) ప్రచార దూతలు.
→ మీ కృషి వైవిధ్యమైనది. మన దేశం. అమృత కాలంలోకి ప్రవేశించిన వేళ ఈ ప్రయా ణంలో మీ పాత్ర అద్వితీయమైనది.
→ భారత విశిష్ట విశ్వ దార్శనికతను ప్రపంచ సుస్థిరతలో మన దేశ పాత్రను బలోపేతం చేయగలిగేది మీరే'నని ప్రధాని మోదీ తెలిపారు.
→ 'సమర్ధత, నైపుణ్యం, నిజాయతీ కలిగిన భారత్ అత్యధిక సంఖ్యలో కలిగి ఉంది.
→ తమ ఘనత గురించి భావితరం ప్రవాస ఆసక్తితో ఉంటార ని పేర్కొన్నారు.
→ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లి స్థిరపడినప్పటికీ భారత సంతతి ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని ప్రశంసించారు.
→ అక్కడ వారు సాధించిన విజయాలను, పొందిన అనుభవాలను, జ్ఞాపకాలను సచిత్ర, శబ్ద, లిఖిత రూపంలో నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
→ జీ-20కి అధ్యక్షత వహించే అవకాశం దక్కడం, కరోనా వైరస్కు టీకాలను దేశీయంగా అభివృద్ధిపరిచి ఉత్పత్తిచేయడం, 220 కోట్ల టీకా డోసుల ఉచిత పంపిణీ తదితర విజ యాలతో పాటు ప్రాచీన భారత ఘనతలను మోదీ గుర్తు చేశారు.
→ ఇందౌర్ నగర విశేషాల గురించి కవితాత్మకంగా వర్ణించారు.
National