image



ఎల్బీనగర్లో దేశంలోనే ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రి
Jan 2023



 
→ రాజధానిలోని ఎల్బీనగర్లో నిర్మిస్తున్న టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) దేశం లోనే ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రిగా నిల వనుంది. 
→ 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ ఆసుప త్రిని 123 మీటర్ల ఎత్తు.. 27 అంతస్తుల్లో నిర్మించనున్నారని తెలిసింది. 
→ దేశంలో ప్రైవే టులోనూ ఇంత ఎత్తయిన ఆసుపత్రి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
→ రూ.668 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి టెండరును ఇటీవల ఎల్ అండ్ టీ దక్కించుకున్న విషయం విదితమే. 
→ టిమ్స్ పేరుతో ఎల్బీనగర్ తో పాటు ఆల్వాల్, సనత్నగర్లో ఒక్కోటి వేయి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
 



TS