image



'డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు' పథకం
January 2023



 
→పొదలకూరు, న్యూస్ టుడే: విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తూ దేశంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. 
→శ్రీపొట్టి శ్రీరా ములు నెల్లూరు జిల్లా పొదలకూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 'డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు' పథ కాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. 
→కోల్గేట్ పామోలివ్ సంస్థతో కలిసి 'బ్రైట్ స్మైల్.. బ్రైట్ ఫ్యూచర్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 
→ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లల్లో 43 శాతం మంది పుచ్చు పళ్లతో ఉన్నారని, వారి సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు. 
→రాష్ట్రంలోని 2,600 ప్రభుత్వ పాఠశాలల్లో నోటి ఆరోగ్యంపై పరీక్షలు నిర్వహిస్తామని, విజయవాడ, కడప, విశాఖపట్నంలలో కేంద్రాలను ఏర్పాటు చేసి.. మొబైల్ దంత వాహనాల ద్వారా చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి సతీష్ రెడ్డి, సీఎస్ఆర్ ప్రత్యేక అధికారి పూనమ్ శర్మ, జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతినిధులు, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 



AP