image



డీఎండీ వ్యాధికి పరిశోధనలు ముమ్మరం చేసిన భారత పరిశోధకులు
January 2023



 →అరుదైన, వైద్యానికి లొంగని జన్యురుగ్మత అయిన డుషెన్ మస్క్యులర్ డిస్ట్రోపీ (డీఎండీ)కి చౌకలో చికిత్స అభివృద్ధి చేయడానికి భారత శాస్త్రవే త్తలు కసరత్తు చేపట్టారు. 
 → ఈ దిశగా కొంత పురోగతి సాధించారు. డిస్ట్రోఫిన్ అనే ప్రొటీన్లో లో మార్పు కార ణంగా డీఎండీ ఉత్పన్నమవుతుంటుంది. 
  →ఇది ఎక్కు వగా మగపిల్లల్లో కనిపిస్తుంటుంది. అరుదుగా అమ్మా యిల్లో ప్రభావం చూపుతుంటుంది. భారత్లో ఈ తరహా కేసులు 5 లక్షలకు పైగా ఉన్నాయి. 
 → ప్రస్తుతం ఈ రుగ్మతకు గట్టి వైద్యం అందుబాటులో లేదు. ఒక్కో చిన్నారికి ఏడాదికి రూ.2-3 కోట్ల విలువైన మందులు వాడాల్సి ఉంటుంది. 
  →ఆ ఔషధాలను చాలా వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందువల్ల ఎక్కువమందికి అందుబాటులో ఉండటం లేదు. 
 → ఈ నేపథ్యంలో జోధ్పూర్ లోని ఐఐటీ శాస్త్రవే త్తలు.. బెంగళూరులోని డిస్ట్రోఫీ ఎనైలేషన్ రీసెర్చ్ ట్రస్ట్ (డార్ట్), జోధ్పూర్ లోని ఎయిమ్స్ తో కలిసి ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యాధికి చౌకలో మందులు అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.
 →ప్రతి 3500 మంది అబ్బాయిల్లో ఒకరికి డీఎండీ సమస్య తలెత్తుతుంటుంది. దీనివల్ల క్రమంగా కండర క్షీణించిపోతుంది. 12 ఏళ్ల వయసు వచ్చేస రికి బాధితులు చక్రాల కుర్చీకి పరిమితం కావాల్సి వస్తుంది. 20 ఏళ్ల వయసు కల్లా వెంటిలేటర్ ఆమ ర్చక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. ఆ తర్వాత మరణం చోటుచేసుకుంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స లేదు. అయితే దీని పురోగతిని నెమ్మదింపచేసి, బాధితుల ఆయుష్షు పెంచే చికిత్సలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత శాస్త్రవేత్తలు యాంటిసెన్స్ ఆలిగో న్యూక్లియోటైడ్ (ఏవోఎన్) ఆధారిత వైద్యం సమర్ధ తను పెంచే విధానాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో డీఎన్ఏ లేదా ఆర్ఎస్ఏలోని ఎక్సాన్స్ అనే నిర్దిష్ట భాగాన్ని 'దాచాల్సి ఉంటుంది. మరోపక్క ఉట్రోఫిన్ మాడ్యులేటర్ అనే చికిత్స విధానంలో గణ నీయ పురోగతి సాధించారు.
 



Science