→ కేవలం 90 సెకన్లలో భూసార పరీక్ష ఫలి తాన్ని వెల్లడించగల ఓ సరళమైన పరికరాన్ని ఐఐటీ కాన్పూర్ కెమి కల్ ఇంజినీరింగ్ విభా గానికి చెందిన ప్రొఫె సర్ జయంత్సింగ్ అభివృద్ధి చేశారు.
→ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని తాను ఆగ్రినెస్ట్ అనే సంస్థకు బదిలీ చేయడంతో.. ప్రస్తుతం అది 'భూపరీక్షక్ పేరుతో సంబంధిత పరికరాన్ని విపణిలోకి తీసుకొస్తోందని జయంత్సింగ్ పేర్కొన్నారు.
→ 'భూపరీక్షక్' విలువ దాదాపు రూ.80 వేలు. ఆది మొబైల్ ఆధారిత యాప్ తో నడుస్తుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మొబైల్లో భూపరీక్షక్ యాప్ డౌన్లోడ్ చేసు కున్న అనంతరం ఈ పరికరం దాంతో బ్లూటూత్ ద్వారా అనుసంధానమవుతుంది.
→ఈ పరికరం అడుగుభాగాన ఉన్న కప్పులో 2 గ్రాముల పొడిమట్టిని వేస్తే 90 సెకన్లలో దాన్ని విశ్లేషించి.. విశ్లేషించి.. భూసారంతోపాటు అందులోని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఆర్గానిక్ కార్బన్ శాతాలను తెలియజేస్తుంది.
→ఏ ఎరువు లను వినియోగించాలో కూడా సూచిస్తుంది. ఆ వివరాలన్నీ మొబైల్ స్క్రీన్పై కనిపిస్తాయి. ఒక్కో పరికరంతో లక్షకుపైగా పరీక్షలు నిర్వహిం చవచ్చని ప్రొఫెసర్ జయంత్సింగ్ చెప్పారు.
InNews