→ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజె క్టులో భాగంగా ఈ ఏడాది ముగ్గురు ఆక్వానా ట్లను సముద్రంలో 500 మీటర్ల లోతుకు భారత్ పంపనుంది.
→ ఇందుకోసం చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇంజినీర్లు ఓ స్టీల్ గోళాన్ని రూపొందించారు.
→మహారాష్ట్రలోని నాగుర్లో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన ఓ అధికారి 'పీటీఐ' వార్తాసంస్థతో ఈ మేరకు వివరాలు పంచుకున్నారు.
→సముద్రగర్భంలో 6 వేల మీటర్ల లోతుకు మనుషుల్ని పంపాలన్న లక్ష్యాన్ని అందు కోవడం ఆలస్యం కానుందని చెప్పారు.
→స్టీల్ చేసిన గోళం 500 మీటర్ల లోతుకు మించి వెళితే ఒత్తిడికి కుంచించుకుపోతుందని పేర్కొన్నారు.
→6 వేల మీటర్ల లోతుకు మనుషుల్ని పంపేందుకు టైటానియం లోహంతో తయారుచేసిన నౌకను వినియోగించాల్సి ఉంటుందని వివరించారు.
→ఉక్రె యిన్ యుద్ధం నేపథ్యంలో టైటానియం సమీక రణ కష్టంగా మారిందని తెలిపారు.
National