image



108వ భారత సైన్స్ కాంగ్రెస్
January 2023



→ శాస్త్రవేత్తలు దేశాన్ని స్వయం సమృద్ధం చేయా లని, ప్రజల రోజు వారీ జీవితంలో మార్పులు తేవ సారించాలని దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. 
 
 
→108వ భారత సైన్స్ కాంగ్రెస్ ను   ఆయన దిల్లీ నుంచి వీడియో సమావేశం విధానంలో ప్రారంభించారు. 
 
→శాస్త్రీయ పద్ధతు లను బలోపేతం చేయాలని, క్వాంటమ్ టెక్నా లజీలు, డేటా సైన్స్, కొత్త టీకాల అభివృద్ధి, కొత్త వ్యాధులను గుర్తించడం లాంటి వాటిపై దృష్టి పెట్టడంతో పాటు యువతరాన్ని పరిశోధ నల దిశగా ప్రోత్సహించాలని తెలిపారు. 
 
→అయిదు రోజుల పాటు కొనసాగే భారత సైన్స్ కాంగ్రెస్ను రాష్టసంత్ తుక్ డోజీ మహారాజ్ నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో ప్రధాని ప్రారం భించారు. 
 
 
→పరిశోధనలు ప్రయోగశాల నుంచి బయటికొచ్చి నేలమీద కనపడాలని, వాటి ప్రభావం అంతర్జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయికి వచ్చినప్పుడే ఆ ప్రయత్నాలు గొప్ప లక్ష్యాలు సాధించినట్లు అవుతుందని ఈ సంద ర్భంగా ఆయన అన్నారు.
 
 
→భారతదేశం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు, రసాయన శాస్త్రం, కమ్యూనికేషన్లు, సెన్సర్లు, క్రిప్టో గ్రఫీ వైపు వేగంగా వెళ్తేందని, యువ శాస్త్రవే త్తలు, పరిశోధకులు ఈ రంగంలో నైపుణ్యం సాధించి ఎదగాలని మోదీ ఆకాంక్షించారు.
 



National