image



నోట్ల రద్దు ప్రకటన నుంచి సుప్రీం తీర్పు వరకు
January 2023



→నవంబరు 8, 2016 ప్రధాని మోదీ జాతినుద్దే శించి ప్రసంగిస్తూ.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన
 
 →నవంబరు 9, 2016: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
 
 →డిసెంబరు 16, 2016: నోట్ల రద్దు నిర్ణయం చెల్లు బాటుతో పాటు ఇతర సవాళ్లపై విచారణను అయిదు గురి సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు అప్పటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకుర్ నేతృ త్వంలోని ధర్మాసనం వెల్లడి
 
 →జులై 23, 2017: గత మూడేళ్లలో ఆదాయపన్ను శాఖ జరిపిన విస్తృత సోదాల్లో సుమారు రూ. 71941 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించినట్లు సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
 
 →ఆగస్టు 11, 2017: నోట్ల రద్దు సమయంలో అసా ధారణ డిపాజిట్లు జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. రూ.
 
 
 →2. 8లక్షల కోట్ల నుంచి రూ.4.3లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా వచ్చి చేరినట్లు ప్రకటించింది.
 
 
 →ఆగస్టు 25, 2017: రూ.50, రూ.200 విలువ గల కొత్త కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది.
 
 
 →సెప్టెంబరు 28, 2022: పెద్ద నోట్ల రద్దుపై దాఖ లైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. నోట్ల రద్దును సవాలు చేసే పిటి షన్లను క్రమంగా పరిశీలిస్తుందని తెలిపింది.
 
 
 →డిసెంబరు 7, 2022: దీనిపై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం ధర్మాసనం.. నోట్ల రద్దు ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు అందజేయా లంటూ కేంద్రంతో పాటు ఆర్బీఐని ఆదేశించింది.
 
 
 →జనవరి 2, 2023: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజార్టీతో సమ ర్థిస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.
 



Economy