image



2021లో దేశంలో జరిగిన రోడ్డుప్రమాదాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నివేదిక
January 2023



→ వాహనం నడుపుతున్న సమయంలో ఫోను వాడటం వల్ల 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 1,997 రోడ్డు ప్రమాదాల్లో 1,040 మంది మరణించారు. 
 
→ 2021లో దేశంలో జరిగిన రోడ్డుప్రమాదాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
→ సిగ్నల్స్ వద్ద రెడ్లైట్ జంపింగు వల్ల 555 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఈ ప్రమాదాల్లో 222 మంది మృతిచెందారు. 
 
→ అలాగే రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరిగి 1,484 మంది మృత్యువాత పడ్డారు.  
 
→వీటి నివారణక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచే యాల్సి ఉందని సూచించింది. 
 
→రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ 'ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ కేర్' అనే పలు దశల ప్రణాళికను రూపొందించినట్లు గుర్తు చేసింది.
 



National