image



పటిష్ఠ భద్రత మధ్య భీమా-కోరెగావ్ వేడుక
January 2023



→ భీమా-కోరెగావ్ యుద్ధానికి 205 ఏళ్ళు పూర్త యిన సందర్భంగా మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఆది వారం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. 
 
→భీమా- కోరెగావ్లోని జయస్తంభ స్మారక స్తూపం వద్ద దళిత సంఘాల ప్రతినిధులు సహా వేల మంది గుమికూడి అమర వీరులకు నివాళి అర్పించారు. 
 
 →2018 జనవరి 1న ఈ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో హింస చోటుచేసుకోవడం, కరోనా పరిస్థితుల తర్వాత మళ్లీ దీన్ని నిర్వహిస్తుండ టంతో ఈసారి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. 
 
 →దళిత సంఘాల వాదన ప్రకారం.. 1818 జనవరి 1న అప్పటి పుణె పాలకుడైన పీష్వాతో జరిగిన యుద్ధంలో దళిత మహర్ సైన్యంతో కూడిన బ్రిటిష్ దళాలు విజయం సాధించాయి. 
 
→ కుల వివక్షకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలపై సాధించిన గెలుపును గుర్తు చేసుకునేందుకు ఏటా ఇక్కడ వేడుకలు నిర్వహించుకుంటారు. 
 



National