→ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాదిలో అతి పెద్ద రాకెట్ ప్రయోగాలకు సన్నాహాలు చేస్తోంది.
→ ఇందులో ఆదిత్య-ఎల్1 వంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్, మంగళయాన్, చంద్రయాన్- 3. మానవ రహిత గగన్ యాన్ ఉన్నాయి.
→ గత ఏడాది ఇస్రో.. పన్వెబ్కు చెందిన 38 ఉపగ్రహాలతోపాటు 5 కీలకమైన ప్రయోగాలు చేపట్టింది.
→ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆదిత్య-ఎల్1, జూన్ లో చంద్రయాన్-3 లక్ష్యంగా పెట్టుకుంది.
→ చంద్రయాన్-2 క్రాస్ ల్యాండింగ్ లోపాలను పరిష్కరిం చడానికి ఏజెన్సీ ల్యాండర్ సిస్టమ్లో అనేక మార్పులు చేసింది.
→ చంద్రుడిపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలిగితే ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.
→ 2029 చివరి త్రైమాసికంలో మానవ రహిత ప్రయోగ వాహనం, ఆర్బిటల్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్, రికవరీ కార్యకలాపాల పనితీరును ధ్రువీకరించడం లక్ష్యంగా గగనాన్ ప్రయోగాలు చేయనుంది.
→ దీని తర్వాత మరో మానవ రహిత ప్రయోగం చేపట్టి, మూడో ప్రయత్నంలో వచ్చే ఏడాది మానవ సహిత ప్రయోగం చేసేలా ప్రణాళికలు రచించింది.
→విదేశాలకు చెందిన ఇంజినీర్లకు బుల్లి ఉప్రగహాల తయారీపై ఇస్రో శిక్షణ ఇస్తోంది.
→పది కిలోల కన్నా తక్కువ బరువుండే వాటిని నానో ఉపగ్రహాలుగా పరిగణిస్తారు.
→అంతరిక్ష శాంతియుత ప్రయోజనాలే లక్ష్యంగా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ ఎఫైర్స్త్స్కో (యూనుసా) ఇస్రో చురుకైన అను బంధం కలిగి ఉంది.
→2018 జూన్లో వియన్నాలో జరిగిన సమావేశంలో భారత్ నానో శాటిలైట్ అభివృద్ధిపై కెపాసిటీ- బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రక టించింది.
→అందులో భాగంగా యునిస్పేస్ నానో ఉపగ్రహాల శిక్షణగా పిలిచే కార్యక్రమాన్ని బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రో ప్రధాన కార్యాలయంతోపాటు ఇస్రోలోని ఇతర విభాగాలు, నిపుణులు, శాస్త్రవేత్తల సహకారంతో నిర్వహిస్తున్నారు.
Science