image



కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత




→కేంద్ర మాజీ మంత్రి, జేడీ-యూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (75)     కన్నుమూశారు. 
 
→నివాసంలోనే కుప్పకూలి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆయన్ని ఆసు పత్రికి తీసుకువచ్చారనీ, అప్పటికి నాడి కూడా కొట్టుకోవడం లేదని గురుగ్రామ్లోని ఫోర్టిస్ ఆసు పత్రి తెలిపింది. 
 
→ఆయన ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలే దని ఒక ప్రకటనలో పేర్కొంది. యాదవ్కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 
 
→వేర్వేరు ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా ఆయన సేవలందించారు. 
 
→ఏడుసార్లు లోక్సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 
 
→2008లో జేడీ- యూ ఆవిర్భవించాక తొలి జాతీయాధ్యక్షునిగా ఎన్నికైన ఆయన 2016 వరకు ఆ పదవిలో కొన సాగారు.
 
→పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
 
→పార్టీలో పదవుల నుంచి ఆయన్ని తొల గించారు. 2018లో లోక్ జనతాదళ్ పార్టీని సొంతంగా ఏర్పాటు చేసుకుని, 2020 మార్చిలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) లో దానిని విలీనం చేశారు. 
 



National