image



డిసెంబర్ 31, 2022 నుండి ఏపీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు




 →సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై ఆంధప్రదేశ్'లో విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి 120 మైక్రాన్లు లేదా అంతకంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఈ నిబంధన డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రాగా, ఇక నుంచి ఎవరైనా వీటిని తయారు చేసినా, అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు ఈ పరిమితి 75 మైక్రాన్ల వరకు ఉండేది. ఇకపై వాడే ప్లాస్టిక్ వస్తువులు పునర్వినియోగానికి అవకాశమున్న సంచులను మాత్రమే వాడేలా పర్యవేక్షించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
 
→అలాగే ప్లాస్టిక్ ప్లెక్సీలపై నిషేధం కూడా ఈ నెల 26 వ తేదీ నుంచి అమలవుతుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను ఏర్పాటు చేశారు. తనఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిస్తే అక్కడికక్కడే కేసుల నమోదుకు ఆస్కారం ఉంది.
 



AP