image



జనవరి 1 నుంచి ఎపిలో పింఛను వారోత్సవాలు




→ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చేలా వృధ్యాప్య ఫించను రూ.2500 నుండి రూ.2750 కి పెంచింది . 
 
→ప్రజలలో దీని గురుంచి అవగాహన పెంచేందుకు ప్రభుత్వం జనవరి 1 నుంచి పింఛను వారోత్సవాలు నిర్వహించనుంది .
 
→జనవరి 2023 నెలలో వైఎస్ఆర్ పింఛను కానుక కింద కొత్తగా 2 లక్షల31 వేల 463 మందికి పింఛన్లు అందజేయనున్నారు. 
 
→జనవరి 2023 గాను పింఛన్ల పంపిణీకి అవసరమైన 1765 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విడుదల చేసింది.  
 
→ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది. 
 
→దీంతో దేశంలోనే అత్యధిక సామాజిక పించన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది . 
 



AP