→ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్ .. ఆం ధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
→100 ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చనుంది. ఔషధాల ఉత్పత్తికి కావాల్సి న కీస్టార్టిం గ్ మెటీరియల్స్ , ఇంటర్మీ డియేట్స్ , యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ , ఫెర్మెంటేషన్ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. కాగా, గ్రాన్యూల్స్ తాజాగా గ్రీన్కో జీరోసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్ను గ్రీన్కో ఈ ప్లాంటుకు సరఫరా చేస్తుంది. అలాగే డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్ఫార్మి న్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్ తయారీలో వాడే రసాయనాలను సైతం అందిస్తుంది.
AP