image



వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్-MV గంగా విలాస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు




→ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13 జనవరి 2023న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్-MV గంగా విలాస్‌ను ప్రారంభించారు.
 
→వారణాసిలో టెంట్ సిటీని కూడా ఆయన ప్రారంభించారు.
 
 క్రూజ్ గురించి:- 
 
→భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా క్రూయిజ్ను నిర్మిం చారు. 3 అంతస్థులు ఉండే నౌక ఇది.
 
→మొత్తం 3200 కిలోమీటర్ల మేర జరగనున్న ఈ నదీయాత్రను పకడ్బం దీగా ప్లాన్ చేశారు. 51 రోజుల పాటు ఈయాత్ర సాగనుంది. మొత్తంగా 27 నదీవ్యవస్థల మీదుగా ఈయాత్ర జరగనుంది. భారత్'లో 2100 కిలోమీటర్లు, బంగ్లాదేశ్'లో 1100 కిలోమీటర్ల పాటు ఎంవీ గంగా విలాస్ పర్యటించనుంది. 
 
→దేశంలో ఐదు రాష్ట్రా లతో పాటు, బంగ్లాదేశ్లోని మిగతా కొన్ని ప్రాంతాల్లో ఇది నడవనుంది. జీవ నదులైన గంగా, బ్రహ్మ పుత్రలతో పాటు భాగీరథీ, బిద్యా వతి, మాట్లా, హుగ్లీ, బంగ్లాదేశ్ లోని పద్మ, మేఘన, జమున నదుల గుండా ప్రవహిస్తుం ది. . వారణాసిలోమొదలై బంగ్లాదేశ్ గుండా అస్సాం లోని దిబ్రూగడ్కు చేరుకోవడంతోయాత్ర పూర్తవుర్త తుంది. 
 
→ఇందులో మొత్తం 32 మంది ప్రయాణించగలరు. వారణాసిలో గంగా హారతి అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. యాత్రలో ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు, పర్యటక ప్రాంతాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించొచ్చు. కజిరంగ నేషనల్ పార్కు, సుందర్బన్ డెల్టా వంటి వాటిని చూడొచ్చు.  
 
→ టికెట్ ధర ఒక్కొ కరికి రోజుకు రూ.25వేలు. దీంతో మొత్తం ప్రయాణానికి రూ.12.75 లక్షలు ఖర్చవుతుందని అంచనా. జనవరి 13న వారణాసిలో ప్రారంభమై మార్చి 1న అస్సాం లోని దిబ్రూగఢ్కు చేరుకుంటుంది. 
 
→టెంట్ సిటీ ప్రత్యేకతలు :. గంగా నది ఒడ్డున టెంట్ నగరాన్ని నిర్మిం చారు. పర్యటకులకు విడిది కల్పించడానికి ఈ టెంట్ సిటీని ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేశారు. 
 
→అంతర్గతర్గ జలమార్గాలను మరింత అధునాతనం చేసి.. నదీ ఆధారిత పర్యటకాన్ని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా టెంట్ సిటీని నిర్మిం చారు.  
 
→ఈ విలాసవంతమైన గుడారాలలో బెడ్రూమ్, డ్రెస్సిం గ్ కమ్-స్టోర్ రూమ్, వాష్ రూమ్ , లాబీ ఉన్నాయి. షీషమ్ చెక్కతో చేసిన ఫర్నిచర్'తో   ఇంటీరియర్ డిజైన్ చేసారు . 
 



National