image



పర్యాటక ప్రాంతంగా రంగనాయకసాగర్ రూ.125 కోట్ల అంచనాతో టెండర్లు




→ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైంది. 
 
→ సిద్దిపేటకు 10 కి. మీ. దూరంలోని ఈ జలాశయం వద్ద రూ.125 కోట్ల అంచనా వ్యయంతో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. 
 
→ బిడ్ డౌన్లోడింగ్ సోమవారం ప్రారంభం కానుంది. దాదాపు 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎప్పుడూ జలాలతో కళకళలా డుతుంటుంది. 
 
→ రిజర్వాయర్ మధ్యలో ద్వీపంలా గుట్ట ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 
 
→ కాళేశ్వరం సర్క్యూట్లో భాగంగా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపో చమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్లను పర్యాటక ప్రాంతా లుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. 
 
→ జలాశయాల్లో బోటింగ్, పక్కన పర్యాటకులకు సౌకర్యాలు, రిజర్వాయర్ల వెంట పచ్చ దనం పెంచడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
 



TS