image



జైపూర్‌లో 18వ వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్




18 వ వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్ సమావేశాలు ఫిబ్రవరి 21 -23 తేదీల మధ్య జైపూర్‌లో నిర్వహించారు. ఈ 3 రోజుల సదస్సును ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశాలను రైల్వే సెక్యూఐర్తి స్ట్రాటజీ - రెస్పాన్సేస్ అండ్ విజన్ ఫర్ ఫ్యూచర్ థీమ్‌తో నిర్వహించారు.
 
ఈ సమావేశాలలో ప్రస్తుత రైల్వే భద్రతా సవాళ్లు మరియు నూతన పరిష్కారాలపై చర్చించారు. అలానే రైల్వే రంగంలో నిర్మాణాత్మక చర్చలు, ఆలోచనల మార్పిడి మరియు ఉత్తమ సాంకేతిక ఉత్పత్తులపై మేధోమథనం జరిగింది.
 
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) భారతదేశంలోని రైల్వే భద్రతా వ్యవహారాలు మరియు చట్టాన్ని అమలు చేసే సంస్థ. ఇది 1957లో ఫెడరల్ ఫోర్స్‌గా ఏర్పాటై, తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతొ సేవలు అందిస్తుంది. ఇది రైల్వే ఆస్తి మరియు రైల్వే ప్రయాణీకుల భద్రతకు బాధ్యత వహిస్తుంది.
 
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) 1922 లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. ఇది రైలు రవాణా పరిశోధన, అభివృద్ధి & ప్రమోషన్ కోసం రైల్వే రంగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
 



National