image



'బారిసు కన్నడ డిమ్ దిమావా' ఫెస్టివల్‌ ప్రారంభం




ఫిబ్రవరి 25 న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ' బరిసు కన్నడ డిమ్ దిమావా సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమాన్ని కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్నారు.
 
ప్రధానమంత్రి 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' విజన్‌కు అనుగుణంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవంకు వందలాది మంది కర్ణాటక నృత్య, సంగీతం, నాటక కళాకారులు తమ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి హాజరయ్యారు.
 



National