image



చంద్రయాన్-3పై కీలక పరీక్ష విజయవంతం




→చందమామపైకి ల్యాండర్, రోవ ర్ను దించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-3 వ్యోమనౌకపై కీలక పరీక్షను భారత అంతరిక్ష పరి శోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పూర్తి చేసింది. 
 
→ఎలక్ట్రో-మ్యాగ్నెటిక్ ఇంటర్ఫి రెన్స్/ ఎలక్ట్రో-మ్యాగ్నెటిక్ కంపాటబిలిటీ (ఈఎంఐ/ ఈఎంసీ) అనే ఈ పరీక్ష బెంగళూరులోని యు. ఆర్. రావు ఉపగ్రహ కేంద్రంలో జరిగింది. 
 
→అంతరిక్ష వాతావరణంలోని విద్యుదయస్కాంత స్థాయిని తట్టుకొని వ్యోమనౌకలోని వ్యవస్థలన్నీ సాఫీగా పని చేసేలా చూడటం దీని ఉద్దేశం. 
 
→జనవరి 31 నుంచి ఈ నెల 2 మధ్య ఈ పరీక్ష జరిగినట్లు ఇస్రో ఆది వారం ఒక ప్రకటనలో తెలిపింది. 
 
→చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ అనే మూడు మాడ్యూల్స్ ఉంటాయి. 
 
→ఈ వ్యోమనౌకను జీఎస్ ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా ఈ ఏడాది జూన్లో ప్రయోగించనున్నారు.
 



Science