image



నీతి ఆయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం




→నీతి ఆయోగ్ సీఈఓగా తెలుగు అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. 
 
→1987 ఛత్తీస్గఢ్ కేడ ర్కు చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. 
 
→ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈఓగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ అమెరికాలోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట ర్ నియమితులయ్యారు. 
 
→కేంద్ర ప్రభుత్వం అయ్యర్ స్థానంలో బీవీఆర్ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. ఈయన ఈ పదవిలో రెండేళ్లు లేదా తదుపరి ఉత్త ర్వులు జారీ చేసేంత వరకు కొనసాగు తారు. 
 
→ఏపీకి చెందిన బీవీఆర్ సుబ్ర హ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం.  
 
→ఆయన తల్లిది కాకినాడ. తండ్రిది ఒడిశాలోని గుణు పురం. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో విద్యా భ్యాసం విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీల్లో సాగింది. 
 
→దిల్లీ కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ లో మెకానికల్లో బీటెక్ చేశారు. తర్వాత ఐఏఎస్కు ఎంపికయ్యారు. లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 
 
→లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో స్విట్జర్లాం డ్లోని వరల్డ్ ట్రేడ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ లా అండ్ ఎకనామిక్స్ మాస్టర్స్ చేశారు. 
 
→2004-08, 2012- 15 మధ్యకాలంలో మన్మోహన్ సింగ్, నరేంద్రమోదీల హయాంలో ప్రధాని కార్యాలయంలో పని చేశారు. ప్రపంచ బ్యాంకులోనూ సేవలందించారు. 
 
→2015లో ఛత్తీ సగఢ్ కేడర్కు వెళ్లారు. 2018 జూన్ లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 
 
→2019లో ఆ రాష్ట్ర విభజన సమయంలో ఈయన ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక పాత్ర పోషించారు. 
 
→ఛత్తీస్ గ ఢ్ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్పుడు అక్కడ తీవ్రవాద ప్రాబల్యాన్ని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషించారు. 
 
→కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిం చారు. 
 
→జీ-20 సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దిల్లీలోని ప్రగతి మైదాన్ పునర్ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించారు. 
 
→ఆయన సతీమణి ఉమాదేవి భమిడి పాటి ఛత్తీస్గఢ్ కేడర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధి కారిగా పనిచేసి ఇటీవల కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు.
 



Appointment