image



తెలంగాణ ప్రభుత్వంతో గ్లాండ్ ఫార్మా ఒప్పందం




→ప్రసిద్ధ ఔషధ సంస్థ 'గ్లాండ్ ఫార్మా' మరో రూ.400 కోట్లతో విస్తరణకు ఏర్పాట్లుచేస్తోంది. 
 
→తద్వారా మరో 500 మందికి పైగా ఈ రంగాలకు చెందిన నిపుణులు, పాక్షిక నైపుణ్యమున్న వారికి ఉద్యో గాలు లభించే అవకాశాలున్నాయి. 
 
→ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ సోమవారం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
 
→ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద సమావేశంలో గ్లాండ్ ఫార్మా ఎండీ, సీఈఓ శ్రీనివాస్ సాదు, పరిశ్ర మల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ జీవశాస్త్రాల విభాగం సీఈఓ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. 
 
→జీనోమ్ వ్యాలీలో 'గ్లాండ్ ఫార్మా బయో ఫార్మాస్యూటి కల్స్' సంస్థను 2022 ఫిబ్రవరిలో స్థాపించారు. 
 
→రూ.300 కోట్లతో నెలకొల్పిన ఈ సంస్థలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగులు పనిచే స్తున్నారు. వ్యాక్సిన్స్, బయోలాజికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్, ఇతరాలను ఉత్పత్తి చేస్తున్నారు. 40 ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉన్నాం. మా సంస్థకు దేశ వ్యాప్తంగా ఎని మిది ఔషధ, జీవశాస్త్ర ఉత్పత్తి కేంద్రాలు న్నాయి. 
 
→తెలంగాణ ప్రభుత్వంతో భాగ స్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. తాజా విస్తరణ ప్రాజెక్టులో భాగంగా బయోలా జికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్, రికాం బినెంట్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణ యించాం' అని సంస్థ ఎండీ శ్రీనివాస్ సాదు ఈ సందర్భంగా వెల్లడించారు.
 
→"సంస్థ విస్తరణతో జీవ శాస్త్ర ఉత్పత్తులపై మరింత దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ రంగంలో శక్తి సామర్థ్యా లను పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. 
 
→తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. జీవ శాస్త్ర రంగంలో రాష్ట్రం ఎంత బలంగా ఉందో తెలపడానికి తాజా పెట్టుబడులే నిదర్శనం. 
 
→ఔషధ, జీవశాస్త్ర రంగాల్లో తెలంగాణ అంతర్జా తీయంగా మరింత ఖ్యాతి గడించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది" అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
 



TS