image



సంసద్ రత్న అవార్డులకు 13 మంది ఎంపీలు




→సంసద్ రత్న అవార్డులకు (2023) గాను కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీ, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, సీపీఎం నేత జాన్ బ్రిటాస్ సహా 13 మంది ఎంపీలు నామినేట్ అయ్యారు. 
 
→వీరిలో 8 మంది లోక్సభ, ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు అవార్డులను రూపొందించిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.  
 
→వీరిలో ముగ్గురు రిటైర్డ్ సభ్యులున్నట్లు పేర్కొంది. కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ ఈమేరకు నామినేట్ చేసినట్లు తెలిపింది.  
 
→స్థాయీసంఘాలకు సంబం ధించి.. జయంత్ సిన్హా (భాజపా, ఝార్ఖండ్) నేతృత్వంలోని ఫైనాన్స్ కమిటీ (లోక్సభ), ఆంధ్ర ప్రదేశ్కు చెందిన వి. విజయసాయిరెడ్డి చైర్మన్ ఉన్న రవాణా, పర్యాటక, సాంస్కృతిక కమిటీ (రాజ్యసభ)లను ప్రత్యేక అవార్డుల కేటగిరీ కింద జ్యూరీ నామినేట్ చేసింది. 
 



National