→ న్యాయ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను మరింత వినియోగించుకునే దిశగా సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసింది.
→ కృత్రిమ మేధస్సు, సహజ | భాషా ప్రక్రియ సహాయంతో అత్యున్నత న్యాయస్థా నంలో మొట్టమొదటిసారి వాదనల ట్రాన్స్క్రిప్షన్(లిఖి తపూర్వక మార్పిడి)ను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
→ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టు గదిలో ప్రయోగాత్మకంగా దీనికి శ్రీకారం చుట్టారు.
→ సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్లోడ్ చేయడానికి ముందు పరిశీలన కోసం సంబంధిత ప్రతులను న్యాయవాదులకు అందజేయనున్నారు.
→ ఇదొక సాధారణ ప్రక్రియగా కొనసాగడానికి ముందు అందులోని లోటుపాట్లను సవరించేందుకు వీలుగా ఒకటి లేదా రెండు రోజులపాటు ప్రయోగాత్మక ప్రాతిపదికగా ఈ ప్రక్రియ చేపడతామని సీజేఐ తెలిపారు.
→ 2022 మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని | రాజ్యాంగ ధర్మాసనం వాదనలను చేపట్టింది.
National