image



మాతృభాషలో బోధనతో విద్యార్థులకు మేలు: యునెస్కో




 
→చిన్న వయసులో మాతృభాషలో విద్యా బోధన కొనసాగిస్తే అది విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని యునెస్కో పేర్కొంది. 
 
→అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలూ మాతృభాషలో బోధన కొనసాగించాలని పిలుపునిస్తూ ట్వీట్ చేసింది. 
 
→"విద్యార్థులు పాఠశాలలో చేరిన ప్రాథమిక దశలో మాతృభాష ఆధారంగా బహుభాషా విద్యను కొనసా గిస్తే అది పిల్లలు బాగా నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి, సమాజంలో పూర్తిగా భాగస్వాములు కావ డానికి ఉపయోగపడుతుంది. 
 
→ప్రపంచవ్యాప్తంగా 40% విద్యార్థులకు వారు మాట్లాడే, అర్థం చేసుకొనే భాషలో చదువుకొనే అవకాశం లేదు. 
 
→మాతృభాషలో విద్యా బోధన జరిగిన చోట ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి మిగతా పిల్లలకంటే 30% ప్రాథమిక అంశా లను వారు చదవగలుగుతారు. 
 
→అందువల్ల మాతృభా | షాధారిత బోధనను అమలు చేయడానికి ప్రపంచ దేశా లకు ఇదే సరైన సమయం. 
 
→అందుకే 24వ అంతర్జా తీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా బహు భాష విద్య మార్పునకు ఒక అవసరం' అన్న అంశంపై దృష్టిసారించాం" అని యునెస్కో పేర్కొంది.
 



International