image



దేశవ్యాప్తంగా స్మగ్లర్లపై ఆపరేషన్ గోల్డెన్ డాన్!




→  ఇండో-నేపాల్ సరిహద్దుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో 'ఆపరేషన్ గోల్డెన్ డాన్ పేరుతో ఏకకాలంలో దాడులు చేశారు. 
 
→  ఈ దాడుల్లో రూ.51 కోట్ల విలువైన 100 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు   తెలి పారు. 
 
→  అక్రమ రవాణాకు సంబంధించి పది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు భారతీయులు, ఏడు గురు సుడాన్ దేశస్థులు ఉన్నారు. 
 
→  పట్నా, పుణె, ముంబయిలతో పాటు ఇండో-నేపాల్ సరిహద్దులో తని ఖీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 
 
→  నిందితుల నుంచి రూ.1.35 కోట్లు విలువ చేసే దేశ, విదేశీ కరె న్సీని సైతం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 
 
→  అక్రమ బంగా రాన్ని ఎక్కువ భాగం పేస్ట్ రూపంలో ఇండో-నేపాల్ సరిహద్దు గుండా బిహార్ రాజధాని పట్నాకు తీసుకొ చ్చారు. 
 
→  ఆపై రైళ్లు, విమానాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కువగా ముంబయికి రవాణా అవుతున్నట్లు గుర్తించారు. 
 
→  ముగ్గురు సుడాన్ దేశస్థులను పట్నా రైల్వే స్టేష న్లో ముంబయి రైలు ఎక్కుతున్న సమయంలో పట్టు కున్నట్లు డీఆర్ఎస్ఐ అధికారులు తెలిపారు. 
 
→  వీరి వద్ద 37. 126 కిలోల బంగారం పేస్ట్ లభ్యమైంది. 
 
→  స్లీన్లెస్ జాకెట్లలో 40 పాకెట్లలో రహస్యంగా దాచిన బంగారాన్ని మరో ఇద్దరు సుడాన్ దేశస్థుల నుంచి స్వాధీనం చేసు కున్నారు. 
 
→  మూడో విదేశీయుడు సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా కార్యకలాపాలకు ఏర్పాట్లు చేస్తున్నాడని తేలింది. 
 
→  ఇద్దరు మహిళల బృందాన్ని బస్సులో హైదరా బాద్ నుంచి ముంబయి వెళ్తుండగా   పుణెలో అరెస్ట్ చేశారు. 
 
→  వారి నుంచి వివిధ రూపాల్లో ఉన్న 5.65లో బగారాన్ని స్వాధీనం చేసుకున్నా మని అధికారులు వెల్లడించారు.
 



National