image



ఉత్తర కొరియా అణు ప్రయోగాలు




 
→అణ్వాయుధ పరీక్షలతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న ఉత్తర కొరియా... సొంత ప్రజలనే కాదు, పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్వాసుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తోంది. 
 
→ప్రపంచంలోనే అత్యధిక అణు సామర్థ్యం కలిగిన దేశంగా అవతరించా లన్న అక్కడి పాలకులు స్వార్థ చింతనే దీనికి ప్రధాన కారణం. ఉత్తర కొరియాలోని 'పుంగేరి' భూగర్భ అణు పరీక్షా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రయోగాలు ఎంతటి విపత్తును కలిగిస్తున్నాయో సియోల్కు చెందిన ఓ మానవ హక్కుల సంఘం తాజా అధ్యయన నివేదికలో వెల్లడించింది. 
 
→భూగర్భ జలాలు కలుషితమవుతున్నా యని, దీంతో ప్రజలకు రేడియోధార్మికత ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. 
 
→ఉత్తర కొరియా ఏడో అణు పరీక్షకు సిద్ధమవుతోందని వార్తలు వస్తోన్న వేళ ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
 
→అమెరికా, దక్షిణ కొరియా ప్రభుత్వాల అంచనా ప్రకారం.. ఉత్తర కొరియా 2006-17 మధ్యకాలంలో ఉత్తర హమ్్యంగ్ ప్రావిన్స్లోని పుంగేరి కేంద్రంలో రహస్యంగా ఆరు అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది. 
 
→ఈ క్రమంలో ఇక్కడి నుంచి భూగర్భ జలాల ద్వారా రేడియోధార్మిక పదార్థాలు స్థానికంగా ఎనిమిది నగరాలు, కౌంటీల్లో విస్త రించి ఉండొచ్చని 'ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్' పేర్కొంది. 
 
→ఈ ప్రాంతాల్లో పది లక్షలకుపైగా జనాభా నివ సిస్తోంది. తాగునీటితో సహా రోజువారీ కార్యకలాపాల్లో చారు భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు.
 
→ఉత్తర కొరియా నుంచి పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్లకు అక్రమంగా రవాణా అయ్యే వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల కారణంగా.. అక్కడి ప్రజలూ కొంతవరకు ప్రమాదంలో పడొచ్చని నివేదిక పేర్కొంది. 
 
→2015లోనే దక్షిణ కొరియా ఆహార భద్రతా సంస్థ తాము దిగుమతి చేసుకున్న పుట్టగొడుగుల్లో సాధారణం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా రేడియోధా ర్మిక సీజీయం ఐసోటోపులను గుర్తించినట్లు వెల్లడించింది. 
 
→చైనా ఉత్పత్తులుగా వాటిని విక్రయించినప్పటికీ, వాస్తవా నికీ అవి ఉత్తర కొరియాలో పండించినవేనని పేర్కొంది. 
 
→అయితే, భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్న ఆరోప ణలను ఉత్తర కొరియా కొట్టిపారేస్తూ వస్తోంది. 
 
→అణు పరీక్షల తరువాత ఎటువంటి హానికరమైన పదార్థాలు లీక్ కాలేవని పేర్కొంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను మాత్రం అందించలేదు. 
 
→2018లో పుంగేరి న్యూక్లియర్ పరీక్ష కేంద్రంలోని కొన్ని సొరంగాలను పరిశీలించేందుకు వెళ్లిన కొంత మంది విదేశీ జర్నలిస్టుల 'రేడియేషన్ డిటె క్టర్లనూ ఉత్తరకొరియా జప్తి చేసింది. 
 
→ఈ నేపథ్యంలో పంగేరి పరిసరాల్లోని ప్రజలకు రేడియేషన్ పరీక్షలు నిర్వ హించాలని, అంతర్జాతీయ విచారణ చేపట్టాలని అధ్య యన సహ రచయిత హూబర్ట్ యంగ్ హ్వాన్ లీ డిమాండ్ చేశారు. 
 
→ఐరాస, ఇతర ప్రభుత్వ నివేదికలు, అణు, వైద్య నిపుణులతో పాటు ఉత్తర కొరియా నుంచి తప్పించుకు వచ్చిన పౌరుల సమాచారం విశ్లేషణ ఆధా రంగా అధ్యయనం కొనసాగింది.
 



International