image



మలయాళ కవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం




→ఆధునిక మళయాళ కవి, విమర్శకుడు, అనువాదకుడు కె.సచ్చిదానందన్‌ను ‘ఎనిమిదవ మహాకవి కన్హయ్యాలాల్‌ సేఠియా కవిత్వ అవార్డు’ వరించింది. 
 
→త్వరలో జరగనున్న 16వ జైపుర్‌ సాహిత్య ఉత్సవంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 
 
→రాజస్థానీ - హిందీ కవి అయిన కన్హయ్యాలాల్‌ పేరిట నెలకొల్పిన ఫౌండేషన్‌ ఆయనకు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ఒక మెమెంటోను బహూకరిస్తుంది. 
 
→సచ్చిదానందన్‌ మొత్తం 21 కవిత్వ సంకలనాలు, 16 ప్రపంచ కవిత్వ అనువాదాలు, ఆంగ్ల, మలయాళ భాషల్లో 21 సాహిత్య విమర్శక గ్రంథాలను వెలువరించారు. 
 
→ఆయన కేరళ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. 
 
→ఆయన కవిత్వ సంకలనాలు 18 భాషల్లో, వివిధ దేశాల్లో ప్రచురితమయ్యాయి.
 



Awards