image



‘ఎలిమెంట్‌ ఆఫ్‌ హర్థ్‌’ అనే పుస్తకాన్ని రాసిన రిషికి ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’




→చిన్న వయస్సులోనే ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ అభివృద్ధి చేసి, ‘ఎలిమెంట్‌ ఆఫ్‌ హర్థ్‌’ అనే పుస్తకాన్ని రాసిన బెంగళూరు నగరానికి చెందిన బాలుడు రిషి శివప్రసన్న (8)కు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం - 2023’ దక్కింది. 
 
→కేంద్ర మానవ వనరుల శాఖ దేశంలోని అసాధారణ ప్రతిభావంతులైన పలువురు బాలలను గుర్తించింది. 
 
→వీరికి దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు.
 
→ రిషి సాధనలు అపూర్వమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై హర్షం వ్యక్తం చేశారు. 
 
→ చిన్నారి ఐక్యూ - 180 ఉన్నట్లు విద్యావేత్తలు ప్రకటించారు. 
 
→ బాలుడి తండ్రి శివప్రసన్నకుమార్‌ బెంగళూరులో ప్రైవేటు అధ్యాపకుడు. తల్లి ఐటీ ఇంజినీరు.
 



Awards