→బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా, భారత మహిళల ఫుట్బాల్ జట్టు గోల్కీపర్ అదితి చౌహాన్ తదితరులకు ఇండియా - యూకే అత్యుత్తమ సాధకులుగా గౌరవ పురస్కారాలు దక్కాయి.
→లండన్లో జరిగిన ఓ వేడుకలో ఈ అవార్డులు అందజేశారు. బ్రిటీష్ విశ్వవిద్యాలయాల్లో చదివిన భారతీయ విద్యార్థుల విజయాలకు గుర్తుగా పూర్వ విద్యార్థులతో ఈ సంయుక్త కార్యక్రమం ఏర్పాటు చేశారు.
→వెయ్యి దరఖాస్తులను నిపుణుల జ్యూరీ పరిశీలించి వీరిని ఎంపిక చేసింది.
→గతేడాది 1.20 లక్షల భారతీయ విద్యార్థులు బ్రిటన్లో విద్యాభ్యాసానికి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.
Awards