→భారతీయ అమెరికన్ రాజా జె చారి పేరును ఎయిర్ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు.
→ఈ మేరకు యూఎస్ రక్షణ శాఖ ప్రకటించింది. దీనికి సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంది. 45 ఏళ్ల చారి ప్రస్తుతం నాసాలో క్రూ-3 కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
→రాజా జె చారి తండ్రి శ్రీనివాస్ చారి హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చారి మసాచుసెట్స్ వర్సిటీ నుంచి ఏరోనాటిక్స్లో మాస్టర్స్ పట్టా పొందారు.
International