image



బ్రెజిల్ లో భగ్గుమన్న అల్లర్లు




→బ్రెజిల్ మాజీ అధ్య క్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు దేశంలో అరాచకం సృష్టించారు. 
 
→ఏకంగా రాజధాని బ్రసీలియా దేశ అధికార కేంద్రాలుగా భావించే నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవ నాలను ముట్టడించారు. 
 
→ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని వారు నిరాకరిస్తున్నారు. దేశాధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా వారం రోజుల క్రితమే అధికారం చేప ట్టిన విషయం తెలిసిందే. 
 
→దీనికి నిరసనగా అది వారం వేలమంది బోల్సొనారో మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేదించుకొని కీలక భవ నాల్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో భవ నాల్లో ఎవరూ లేరు. కొందరు ఆందోళనకా రులు అక్కడ కిటికీలను, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. సైన్యం జోక్యం చేసుకుని బోల్సొనారోకు అధికారం కట్టబెట్టాలని లేదా లూలాను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు వేల మందికిపైగా అల్లరి మూకలు వీటిల్లో పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు. వారిని చెదరగొట్టడానికి సుప్రీం కోర్టు వద్ద భద్రతా దళాలు హెలికాప్టర్ల నుంచి టియర్ గ్యాస్ను ప్రయోగించాయి. అల్లర్లను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులు. పోలీసులపైనా దుండగులు దాడులకు దిగారు. కొన్ని గంటల అనంతరం పోలీసులు 12 వందల మంది నిర సనకారులను అరెస్టుచేసి మూడు భవనాలను తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
 
→బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని నేషనల్ కాంగ్రెస్ భవనం పద్ద ఆందోళన చేస్తున్న జైర్ బోల్సొనారో మద్దతుదారులు కోర్టులు  వ్యతిరేకంగా పనిచేశాయి.
 
→ఇటీవల జరిగిన ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సెనారోకు 49. 1 శాతం వచ్చాయి. ఎన్నికల ఫలితాలను అంగీక రించడానికి బోల్సొనారో నిరాకరిస్తున్నారు. 
 
→దేశం లోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతి రేకంగా పనిచేశాయని ఆయన ఆరోపిస్తున్నారు.
 



International