image



భారత కాకస్‌ సహాధ్యక్షులుగా రో ఖన్నా, మైక్‌ వాల్ట్‌జ్‌ ఎన్నిక




→అమెరికాలోని ప్రస్తుత 118వ కాంగ్రెస్‌ సభలో భారత్‌తో పాటు ఇండో అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన కాకస్‌ సహాధ్యక్షులుగా (కో-ఛైర్స్‌) ఇండో అమెరికన్‌ అయిన డెమోక్రటిక్‌ సభ్యుడు రో ఖన్నా (46), రిపబ్లిన్‌ హౌస్‌ సభ్యుడు మైక్‌ వాల్ట్‌జ్‌ ఎన్నికయ్యారు. 
 
→ఈ కాకస్‌ అమెరికా ప్రతినిధుల సభలో చట్టసభ సభ్యుల అతిపెద్ద ద్వైపాక్షిక కూటమి. 
 
→ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఇది కృషి చేస్తుంది. 
 
→1993లో మొదటిసారిగా ఏర్పడిన ఈ కాకస్‌కు ఇప్పటిదాకా సహాధ్యక్షుడిగా ఎన్నికైన రెండో ఇండో అమెరికన్‌ రో ఖన్నా. 
 
→115వ కాంగ్రెస్‌ సభలో (2015 - 16) ఇండో అమెరికన్‌ అమీ బేరా ఈ కాకస్‌కు సహాధ్యక్షుడిగా పనిచేశారు. 
 
→ప్రస్తుత కాంగ్రెస్‌ సభలో అయిదుగురు ఇండో అమెరికన్లు ఉన్నారు.
 



International