image



సైబర్‌ సెక్యూరిటీ బలోపేతానికి క్వాడ్‌ నిర్ణయం




→సైబర్‌ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు మెషిన్‌ లెర్నింగ్‌తో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్‌ కూటమి నిర్ణయించింది. 
 
→శ్వేతసౌధం వెలువరించిన ఓ ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. సైబర్‌ నేరాలను ఎదుర్కోవడానికి సభ్య దేశాలకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపింది. 
 
→తమ తమ దేశాల్లోని ప్రజలకు, ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడానికి క్వాడ్‌ కృషి చేస్తుందని వివరించింది.
 



International