→ప్రస్తుతం అమలులో ఉన్న అత్యయిక స్థితిని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మయన్మార్లో అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వం ప్రకటించింది.
→ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలను జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది.
→ఈ మేరకు సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్ఎస్డీసీ) నిర్ణయం తీసుకుంది.
→ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మరికాస్త సమయం పడుతుందని ఎన్ఎస్డీసీ తన ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.
International