→నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్కు చెందిన రామ్చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు.
→ప్రధాని పుష్పకమాల్ దహాల్ ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి ఆయనకు మద్దతుగా నిలిచింది.
→550 మంది అసెంబ్లీ సభ్యుల్లో 518 మంది, 332 మంది ఎంపీల్లో 313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు.
→ఎమ్మెల్యేల్లో 352 మంది, ఎంపీల్లో 214 మంది పౌడెల్కు ఓటు వేశారు.
→మాజీ ప్రధాని కె.పి.శర్మ నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాష్ చంద్ర నెబ్మాంగ్ ఓడిపోయారు.
→ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ పదవీ కాలం మార్చి 12తో ముగియనుంది.
→2008లో గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత నేపాల్లో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి.
→మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన పౌడెల్, 16 ఏళ్ల వయసులో విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించారు.
→ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగారు.
International