image



భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి!




→భారత్‌లో అమెరికా రాయబారిగా అధ్యక్షుడు బైడెన్‌ సన్నిహితుడు ఎరిక్‌ గార్సెట్టి నియామకం ఖరారైంది. 
 
→ఆయన నామినేషన్‌ను సెనెట్‌ 52-42 మెజార్టీతో ఆమోదించింది. గార్సెట్టి నామినేషన్‌ 2021 జులై నుంచి పెండింగ్‌లో ఉంది. 
 
→ఆయన లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌గా ఉన్నప్పుడు ఒక మాజీ సీనియర్‌ సలహాదారుపై వచ్చిన లైంగిక వేధింపుల వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. 
 
→ఈ కారణంతో కొందరు నెనెట్‌ సభ్యులు గతంలో ఆయన నామినేషన్‌పై అభ్యంతరాలు లేవనెత్తడంతో ఆయన నియామకం పెండింగ్‌లో పడింది. 
 
→ఇప్పుడు సెనెట్‌ ఆమోదంతో ఎట్టకేలకు ఆయన నియామకం ఖరారైంది. దీంతో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న అమెరికా రాయబారి పదవి త్వరలోనే భర్తీ కానుంది.
 



International