image



అమెరికా ‘సలహా కమిటీ’లో సభ్యులుగా ఇద్దరు భారతీయ అమెరికన్లు




→అమెరికా వాణిజ్య విధానం - సంప్రదింపుల సలహా కమిటీలో ఇద్దరు భారతీయ అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. 
 
→ఈ సలహా కమిటీలో సభ్యులుగా భారతీయ అమెరికన్లు రేవతి అద్వైతి - ఫ్లెక్స్‌ సీఈవో, మనీష్‌ బాప్నా - నేచురల్‌ రిసోర్సెస్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సీఈవో సహా 14 మంది పేర్లను ఆయన ప్రకటించారు. 
 
→అమెరికా వ్యాపార ప్రతినిధికి ఈ కమిటీ విధాన సలహాదారుగా సేవలందిస్తుంది. వ్యాపార ఒప్పందాలకు ముందు చర్చలు, సంప్రదింపులు నిర్వహిస్తుంది.
 



International