→అమెరికా అధ్యక్షుడు బైడెన్ 2024 ఎన్నికల ప్రచార సలహా మండలిలో ముగ్గురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది.
→అమెరికా కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అమి బెరా, కాంగ్రెస్లో భారత్కు మద్దతు పలికే గ్రూపు ఉపాధ్యక్షులు రో ఖన్నా, సిన్సినాటి మేయర్ అఫ్తాబ్ పురేవాల్ సభ్యులుగా నియమితులయ్యారు.
→50 మందితో ఏర్పాటు చేసిన ఈ జాతీయ సలహా మండలికి మాజీ స్పీకరు నాన్సీ పెలోసీ అధ్యక్షత వహిస్తారు.
→మండలి సభ్యులు మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొనడంతో పాటు నిధుల సేకరణ, కార్యక్రమాల రూపకల్పన వంటి బాధ్యతలను నిర్వహిస్తారు.
International