image



భారత్, ఇండోనేసియా నౌకాదళ విన్యాసాలు ప్రారంభం




→భారత్, ఇండోనేసియా నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు ప్రారంభమయ్యాయి. 
 
→ఆరు రోజుల పాటు సాగే ఈ యుద్ధక్రీడలకు ‘సముద్ర శక్తి’ అని పేరు పెట్టారు. ఇండోనేసియాకు సమీపంలో ఇవి జరుగుతున్నాయి. 
 
→భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ కవరత్తి యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం డోర్నియర్, ఒక చేతక్‌ హెలికాప్టర్‌ పాలుపంచుకుంటున్నాయి. 
 
→ఇండోనేసియాకు చెందిన కేఆర్‌ఐ సుల్తాన్‌ ఇస్కాందర్‌ ముదా యుద్ధనౌక, సీఎన్‌ 235 గస్తీ విమానం, ఏఎస్‌565 పాంథర్‌ హెలికాప్టర్‌ ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
 



International