→దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత భారత్ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.
→1996లో ఈ అంతర్జాతీయ పోటీలకు భారత్ వేదికగా నిలిచింది.
→మళ్లీ ఇన్నాళ్లకు 71వ ప్రపంచ సుందరి - 2023 ఫైనల్ పోటీలు వచ్చే నవంబరులో ఇక్కడ జరగనున్నాయి. తుది తేదీలు ఇంకా ఖరారు కాలేదు.
→మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్పర్సన్, సీఈవో జులియా మోర్లే ఈ విషయాన్ని ప్రకటించారు.
→ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ సుందరి టైటిల్ను భారత్ గతంలో ఆరుసార్లు గెలిచింది.
→రీటా ఫరియా (1966), ఐశ్వర్యారాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ఇప్పటివరకు భారత్ నుంచి ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు.
International