→చరిత్రాత్మక తొమ్మిదో యోగా దినోత్సవం అత్యున్నత ఐక్యరాజ్య సమితి వేదికపై వెలుగులీనింది.
→భారత్ ప్రతిపాదనతో ఏటా జూన్ 21న నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈసారి ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసింది.
→అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహించి భారత్ తన ఔన్నత్యాన్ని చాటుకుంది.
→ప్రపంచంలోని అత్యధిక దేశస్థులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్ బుక్లోనూ చోటు సంపాదించింది.
→యోగా విశ్వవ్యాప్తమని, దానికి కాపీరైట్, పేటెంట్లాంటివేవీ లేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
→ఐరాసలో మోదీ నేతృత్వం వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది.
→అత్యధిక దేశస్థులు పాల్గొన్న కార్యక్రమంగా రికార్డు సృష్టించింది.
→సంబంధించిన ధ్రువపత్రాన్ని గిన్నిస్ ప్రతినిధులు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్కు అందజేశారు.
→దాదాపు 180 దేశాల ప్రతినిధులు హాజరైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
International