→కంబోడియాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి హన్సేన్ (70) వెంటనే పాలక కంబోడియన్ పీపుల్స్ పార్టీని సమావేశపరచి తన పెద్ద కుమారుడు హన్మానెట్ (45)ను భావి ప్రధానమంత్రిగా ఎంపిక చేయించారు.
→మానెట్ బ్రిటన్లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డి చేసి, అమెరికాలో సైనిక శిక్షణ పొందారు.
→చిరకాలంగా ప్రభుత్వ ఉక్కుపాదం కింద నలిగిపోతున్న కంబోడియా ప్రజలపై వారసత్వ పాలనను రుద్దడానికి ప్రధాని హన్సేన్ నామ్కే వాస్తే ఎన్నికలను ఉపయోగించుకున్నారు.
→దశాబ్దాలుగా దేశాన్ని ఏకఛతాధిపత్యంగా పాలిస్తున్న పీపుల్స్ పార్టీకి తాజా ఎన్నికల్లో పేరుకే 17 ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ ఎదురైంది.
→పాలక పార్టీకి నిజమైన సవాలుదారైన కంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీ విదేశీ శక్తుల తోడ్పాటుతో తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందనే బోగస్ ఆరోపణతో సుప్రీంకోర్టు ఆ పార్టీని రద్దు చేయడంతో హన్సేన్కు ఎదురే లేకుండా పోయింది.
International