→దీర్ఘకాలంగా పాలిస్తున్న నియంత నేత హన్సెన్ తనయుడు హన్ మనెట్ (45)ను ప్రధానమంత్రిగా కంబోడియా పార్లమెంటు ఆమోదించింది.
→కంబోడియా జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి జులైలో మనెట్ ఎన్నికయ్యారు.
→సైన్యాధిపతిగా సేవలందించిన తర్వాత కంబోడియా పాలన పగ్గాలు దక్కించుకున్న హన్సెన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు.
→ఆసియాలోనే అత్యంత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న దేశాధినేతగా గుర్తింపు పొందారు.
→మానవ హక్కుల్ని కాలరాస్తున్నారనే అభియోగాలను కంబోడియా ఎదుర్కొంటున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.
→నూతన కేబినెట్లోనూ నేతల వారసులకే సముచిత స్థానం లభించింది.
International