→జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్ కీలక ప్రయోగం చేపట్టింది.
→పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
→నైరుతి జపాన్లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్-రే టెలిస్కోప్ (ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్), లూనార్ ల్యాండర్ను తీసుకొని హెచ్-2ఏ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
→జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ జక్సా ఈ ప్రయోగాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేసింది.
→నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత ఎక్స్ఆర్ఐఎస్ఎం (ఎక్స్-రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపి మిషన్) ఉపగ్రహాన్ని హెచ్-2ఏ రాకెట్ భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
→గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
→విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని జపాన్ చెబుతోంది.
→ఇక ఇదే ప్రయోగంలో జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) పేరుతో ఓ తేలికపాటి లూనార్ ల్యాండర్ను కూడా పంపించారు.
→ఈ ల్యాండర్ మూడు - నాలుగు నెలల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.
→అంటే వచ్చే ఏడాది జనవరిలో ఈ స్లిమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగనుందని స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
→జాబిల్లి, ఇతర గ్రహాలపైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం ‘పిన్ పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీ’తో స్లిమ్ను అభివృద్ధి చేశారు.
→సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలోమీటర్లు అటుఇటుగా దిగుతుంటాయి.
→కానీ, నిర్దేశిత ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్ అయ్యేట్లు దీనిని డిజైన్ చేశారు.
→మొత్తంగా చంద్రునిపై అధ్యయనానికి ప్రయోగాలు చేపట్టిన దేశాల సంఖ్య జపాన్తో కలిసి 5కు చేరుకుంది.
International