→ఈ ఏడాది ఉత్తరార్ధ గోళంలో ఆగస్టులో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ (డబ్ల్యూఎంవో), ఐరోపా వాతావరణ సంస్థ కొపెర్నికస్ ప్రకటించాయి.
→అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది జూలైలో నమోదయ్యాయి.
→ఆగస్టులో ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి పూర్వమున్న స్థాయికన్నా 1.5 సెల్సియస్ డిగ్రీలు ఎక్కువ.
→ఈ లెక్కన భూఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల వద్ద పట్టి నిలపాలన్న పారిస్ వాతావరణ సభ తీర్మానం ఏమవుతుందనే ఆందోళన పెరిగింది.
→భూమిపై 70 శాతం సముద్రాలే ఉన్నాయి. అవి ఈ ఏడాది మూడు నెలల పాటు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేశాయి.
→వాటి ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది.
→దీనిపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ వాతావరణ విచ్ఛిన్నం మొదలైందని హెచ్చరించారు.
International