→రాజకీయ పార్టీల ఆదాయ వివరాలను వెల్లడించిన ఈసీ
→ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు స్వీక రించిన పార్టీల్లో భాజపా తొలిస్థానంలో నిలిచింది.
→2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎన్నికల కమిషన్ పలు వివరాలను వెల్లడించింది.
→ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భాజపా రూ. 1,033.7 కోట్లు అందుకోగా.. కాంగ్రెస్ రూ. 347.99 కోట్లు స్వీకరించింది.
→మొత్తంగా భాజపా రూ. 1,917.12 కోట్లు పొందగా.. కాంగ్రెస్కు రూ.541.27 కోట్లు వచ్చా యని తెలిపింది.
→ఇందులో భాజపాకు రూ.854. 46 కోట్లు వ్యయం అవగా.. కాంగ్రెస్కు రూ. 400. 41 కోట్లు ఖర్చయ్యాయి.
→సీపీఐ రూ.2.87 కోట్లు ఆదాయం చూపించగా.. రూ.1.18 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపింది.
→ ఈ వివరా లను ఈసీ తమ వెబ్సైట్లో పొందుపర్చింది.
National